టీ20 ఆసియా క్వాలిఫైయర్‌లో మంగోలియా 10 పరుగులకే ఆలౌట్ అయి, అత్యల్ప స్కోర్ రికార్డును సమం చేసింది. సింగపూర్ 5 బంతుల్లో విజయం.

మంగోలియా టీ20లో 10 పరుగులకే ఆలౌట్

టీ20 అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తాజాగా సంచ‌ల‌నం న‌మోదైంది. బాంగీలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్-ఏలో మంగోలియా జ‌ట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. సింగ‌పూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు ఇలా త‌క్కువ స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. దీంతో పురుషుల టీ20లో అత్యల్ప స్కోరును సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా ఇలాగే ప‌ది ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దాంతో ఇప్పుడు ఆ అత్య‌త్ప స్కోర్‌ రికార్డు స‌మం అయింది. ఇక మంగోలియా ఇన్నింగ్స్‌లో…

Read More
గాయాలతో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ దులీప్ ట్రోఫీకి దూరమయ్యారు. ఇషాన్ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి.

దులీప్ ట్రోఫీకి ఇషాన్, సూర్య దూరం

దులీప్‌ ట్రోఫీ కోసం గతంలో ప్రకటించిన జట్లలో బీసీసీఐ కొన్ని మార్పులు చేసి కొత్త ఆటగాళ్లను ప్రకటించింది. నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఇప్పటికే బెంగళూరులో ఇండియా ఎ – ఇండియా బి జట్లు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఇండియా డి – ఇండియా సి జట్ల మధ్య అనంతపురంలో మరో మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ జట్లకు దూరమయ్యారు.   బుచ్చిబాబు టోర్నీలో గాయంరెడ్‌బాల్ క్రికెట్‌లో…

Read More
పాకిస్థాన్‌పై సిరీస్ నెగ్గి బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరింది. భారత్, ఆస్ట్రేలియాకు సవాల్‌ విసిరేందుకు సిద్దం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి దూసుకొచ్చిన బంగ్లాదేశ్

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చి ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఫైనల్స్‌లో చోటు కోసం పోరాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పత్తాలేకుండా పోయిన ఈ జాబితాలోకి ఇప్పుడు అనూహ్యంగా బంగ్లాదేశ్ దూసుకొచ్చి భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్…

Read More
2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 11-15కు లార్డ్స్‌లో జరగనుంది. ఐసీసీ ఈ వివరాలు వెల్లడించగా, టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంది.

లార్డ్స్‌లో చాంపియన్స్ తుదిపోరు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15వ తేదీ (2025) వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.  లార్డ్స్ మైదానం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదిక కావడం ఇదే మొదటిసారి అవుతుంది. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్ వేదిక అయ్యాయి. మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అగ్రస్థానంలో నిలిచిన…

Read More
అశ్విన్ జడేజా ప్రతిభను మెచ్చుకుంటూ, జట్టులో స్థానం కోల్పోవడంపై అసూయ లేనని స్పష్టం చేశాడు. స్నేహపూర్వక సంబంధం ఉందని పేర్కొన్నాడు.

అశ్విన్ జడేజాపై ప్రశంసలు, అసూయను నిస్సందేహంగా ఖండించారు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దాదాపు రెండు దశాబ్దాలుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టుకు కీలకమైన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్ల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితులలో ఇద్దరికీ సమష్టిగా బౌలింగ్ అవకాశాలు లభిస్తుండగా.. విదేశాల్లో ఆడే టెస్టులకు మాత్రం జడేజా కంటే అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంటుంది. కాగా తోటి స్పిన్నర్ జడేజాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన…

Read More
అశ్విన్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ జట్టులో కెప్టెన్‌గా ధోనీ, ఓపెనర్‌గా రోహిత్, కోహ్లీలను ఎంపిక చేశారు. 7 భారతీయులు, 4 విదేశీయులు ఉన్నారు.

రవిచంద్రన్ అశ్విన్ ఆల్-టైమ్ ఐపీఎల్ జట్టు ప్రకటింపు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ జట్టుని ప్రకటించాడు. ఈ టీమ్‌లో ఏడుగురు భారతీయ క్రికెటర్లే ఉన్నారు. ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్య్రూ రస్సెల్, గౌతమ్ గంభీర్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు ఇవ్వని అశ్విన్.. నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్లను జట్టులోకి తీసుకున్నాడు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే టీమ్‌లోకి తీసుకున్నాడు. అయితే…

Read More
ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు రోహిత్‌ శర్మను రిటెయిన్‌ చేస్తారో లేదో అన్న ఊహాగానాలపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని గోయెంకా స్పందించారు.

రోహిత్‌ శర్మపై లక్నో రూమర్లు, యజమాని స్పందన

ఐపీఎల్ 2025 మెగా వేలం సందడి మొదలైంది. మెగా వేలం కారణంగా ప్రధాన జట్టులో మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. ఈసారి 10 జట్లలో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను రిటెయిన్ చేసుకుంటాయనేది క్రికెటర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిటెయిన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ 5-6 మించి ఎక్కువ మంది ఆటగాళ్లకు అనుమతి ఉండకపోవచ్చునని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల అందరి దృష్టి ముంబై…

Read More