
కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ CM పుష్ప శ్రీవాణి
విలేకరుల సమావేశం:పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంపుపై విమర్శ:విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై భారాన్ని మోపడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పినా, ఇప్పుడు ప్రజలు బరువు మోస్తున్నారనేది ప్రభుత్వ దిష్టిబొమ్మగా నిలిచిందని మండిపడ్డారు….