రైతుల ఆందోళనపై రాజ్యసభ చైర్మన్ ప్రశ్నలు
దేశానికి అన్నం పెట్టే రైతన్న తమ హక్కుల కోసం ఆందోళన చేసుకుంటున్న పరిస్థితి కలిగినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రశ్నించారు. మంగళవారం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన పలు ప్రశ్నలు సంధించి, ‘అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం కలలు కనడం కాకుండా దానిని లక్ష్యంగా నిర్ణయించి ముందుకు సాగడం ఇదే మొదటిసారిగా చూస్తున్నా. దేశం ఉన్నత శిఖరాలవైపు పయనిస్తోంది. అయితే, రైతులు మాత్రం ఆందోళన…
