Massive crowd gathers at Maha Kumbh Mela for Vasant Panchami, with devotees performing holy dips at Triveni Sangam.

వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భారీగా భక్తులు!

వసంత పంచమి పర్వదినం సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా అమృతస్నానాలు చేస్తూ భక్తి సంద్రంగా మారింది. త్రివేణీసంగమంలో పవిత్ర స్నానం ఆచరించి పాప విమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఒక్కరోజే 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. కుంభమేళా ప్రధాన ఘట్టాల్లో వసంత పంచమి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. భక్తులతో పాటు సాధువులు, మునులు, అఖాడాల గురువులు…

Read More
Two students from Andhra Pradesh died in a road accident in Ireland, and two others were severely injured.

ఐర్లాండ్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మరణం

ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారుగా ఏలూరు జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ (24) మరియు పల్నాడు జిల్లా రొంపిచర్లపడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ (25) గుర్తించబడ్డారు. చిట్టూరి భార్గవ్ మరియు చెరుకూరి సురేష్ తమ సహచరులతో కలిసి కారులో ట్రిప్‌కు వెళ్ళిపోతుండగా, ఐర్లాండ్‌లోని రాతో ప్రాంతంలో ప్రమాదం జరిగింది. భారీ మంచు కురవడం…

Read More
In Kerala, Mihir, a victim of brutal ragging, ended his life by jumping from the 26th floor. Parents demand justice with strong evidence.

ర్యాగింగ్ తట్టుకోలేక 15 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య!

కేరళలోని ఎన్నాకుళం జిల్లా త్రిప్పునితురలో దారుణం చోటుచేసుకుంది. గ్లోబల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మిహిర్, ర్యాగింగ్‌ను తట్టుకోలేక భవనం 26వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిహిర్‌పై అమానవీయంగా ప్రవర్తించిన తోటి విద్యార్థులు అతడిని తీవ్రంగా అవమానించారని తల్లి రాజ్నా తెలిపారు. తన కుమారుడి ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి మిహిర్ తల్లిదండ్రులు ప్రయత్నించారు. స్కూల్‌లోని విద్యార్థులు, స్నేహితుల ద్వారా ర్యాగింగ్‌ ఘటన…

Read More
BJP slams Sonia Gandhi’s remarks on President Murmu’s speech, calling them inappropriate and disrespectful.

రాష్ట్రపతి వ్యాఖ్యలపై సోనియా వ్యంగ్యం, బీజేపీ ఘాటు స్పందన

పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. రాష్ట్రపతి ప్రసంగం చివరికి వచ్చేసరికి ఆమె బాగా అలసిపోయారని, మాటలు చెప్పలేకపోయారని సోనియా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించగా, ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ…

Read More
Congress MP Rakesh Rathod was arrested on rape charges. The court rejected his anticipatory bail plea.

అత్యాచార ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అరెస్ట్

కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యాచార ఆరోపణల కేసులో అరెస్టు చేశారు. సీతాపూర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా పోలీసులు ఆకస్మికంగా అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. బాధితురాలు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఆరోపణలకు సంబంధించి కాల్ రికార్డింగ్‌లను కూడా సమర్పించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రాకేశ్…

Read More
Tragedy at Maha Kumbh Mela as 30 lose their lives in stampede. Petition filed in Supreme Court over safety issues.

మ‌హా కుంభమేళా తొక్కిస‌లాట – 30 మంది మృతులు

ప్ర‌యాగ‌రాజ్‌లోని మ‌హా కుంభ‌మేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘ‌ట‌న దేశవ్యాప్తంగా షాక్ ఇచ్చింది. బుధవారం తెల్లవారుజామున మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది భ‌క్తులు సంగం ఘాట్ వ‌ద్ద త‌ర‌లివ‌స్తున్న సమయంలో ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందులో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డవారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై యూపీ సర్కారు నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌స్తావిస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. విశాల్ తివారీ అనే న్యాయ‌వాది ఈ పిటిష‌న్ వేయ‌డం జ‌రిగింది. పిటిష‌న్‌లో రాష్ట్రాల‌కు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చేలా సుప్రీంకోర్టును…

Read More
Professor-student "wedding" video sparks controversy. University orders probe; professor calls it a psychodrama.

విద్యార్ధిని వివాహం చేసుకున్న ప్రొఫెసర్ వీడియో వైరల్

తరగతి గదిలో విద్యార్ధిని వివాహం చేసుకుంటున్నట్లుగా ఉన్న మహిళా ప్రొఫెసర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో గల అబుల్ కలాం అజాద్ యూనివర్శిటీలో చోటుచేసుకుంది. హిందూ బెంగాలీ సంప్రదాయం ప్రకారం వివాహ కర్మలు నిర్వహించినట్లు కనిపించడంతో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. వీడియోలో ప్రొఫెసర్‌ సంప్రదాయంగా అలంకరించుకుని ఉన్నారు. విద్యార్ధితో కలిసి మంగళసూత్రం ధరించడం, సింధూర్ దాన్ చేయడం, మాలలు మార్చుకోవడం వంటి కర్మలు చేశారు. ఇది సోషల్…

Read More