CM Chandrababu Naidu to visit Chennai for IIT Madras Research Summit. TDP cadres plan a grand welcome.

చెన్నై పర్యటనలో చంద్రబాబు.. రీసెర్చ్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చెన్నై పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మీనంబాక్కం పాత ఎయిర్‌పోర్ట్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ చేరుకుని ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ (ఏఐఆర్ఎస్ఎస్) 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. సదస్సులో పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధక విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉన్న అవకాశాలు, అధునాతన పరిశోధన విధానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని…

Read More
Madras HC protects techie Prasanna Shankar from police harassment following his wife's complaint; alleges illegal searches and demands.

టెక్కీ ప్రసన్న శంకర్‌కు హైకోర్టు రక్షణ

చెన్నైకి చెందిన ప్రముఖ టెక్కీ, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ తనపై భార్య తప్పుడు కేసు పెట్టిందని, పోలీసులు అక్రమంగా వేధిస్తున్నారని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన స్నేహితుడిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, తన వెకేషన్ హోమ్‌పై దాడి చేసి సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. తన భార్య దివ్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పదే పదే సమన్లు జారీ చేస్తూ, బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రసన్న శంకర్ కోర్టుకు తెలిపారు….

Read More
After witnessing the Meerut incident, Babloo decided to marry off his wife to her lover to avoid any future harm.

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. అసలేమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్‌కుమార్‌కి ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తాజాగా బబ్లూ దీనిపై స్పందిస్తూ, తన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. బబ్లూ మాట్లాడుతూ, “ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపడం చూస్తున్నాం” అని చెప్పాడు. ముఖ్యంగా మీరట్‌లో జరిగిన ఘటన తన నిర్ణయానికి కారణమైందని…

Read More
In Uttar Pradesh, a wife conspired with her lover to kill her husband just two weeks after marriage. Police investigation revealed shocking details.

పెళ్లయిన రెండు వారాల్లోనే భర్త హత్యకు కుట్ర

ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో పెళ్లయిన రెండు వారాలకే భర్త హత్యకు కుట్ర పన్నిన భార్య సంచలనం రేకెత్తించింది. 22 ఏళ్ల ప్రగతి యాదవ్ తన ప్రియుడు అనురాగ్ యాదవ్‌తో కలిసి భర్త దిలీప్‌ను హత్య చేయించింది. నాలుగేళ్లుగా ప్రగతి, అనురాగ్ ప్రేమలో ఉన్నా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 5న దిలీప్‌తో ఆమెకు వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను తొలగించేందుకు ప్రగతి, అనురాగ్ కలిసి ప్రణాళిక రూపొందించారు. భర్తను పొలాల్లోకి తీసుకెళ్లి కాంట్రాక్ట్ కిల్లర్…

Read More
Declared Dead, Cremated – Returns Home After 18 Months!

చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. 18 నెలల తర్వాత ఇంటికి తిరిగి!

మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ వింత సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 18 నెలల క్రితం అదృశ్యమైన లలితా బాయి అనే మహిళను చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు, గుర్తుతెలియని ఓ మృతదేహాన్ని ఆమెదేనని పొరబడి అంత్యక్రియలు కూడా జరిపారు. అయితే తాజాగా ఆ మహిళ ఊహించని విధంగా ఇంటికి తిరిగి రావడంతో కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మండ్సర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. లలితా బాయి అదృశ్యమైన తరువాత కుటుంబసభ్యులు…

Read More
Union Minister Annapurna Devi condemns Allahabad High Court’s controversial verdict on sexual harassment, urges Supreme Court review.

హైకోర్టు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. మహిళ ఛాతిని తాకడం అత్యాచార కిందకు రాదంటూ ఇచ్చిన తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్రంగా మండిపడ్డారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఈ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. 2021లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా, న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు నిందితులకు అనుకూలంగా…

Read More
Three Indians may face the death penalty in Indonesia for a drug smuggling case, with the verdict expected on April 15.

ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష

ఇండోనేషియాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు భారతీయులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్‌లు గతేడాది జులైలో సింగపూర్ జెండా కలిగిన ఓడలో భారీగా మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు 106 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు భారతీయులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఇండోనేషియా కఠినమైన…

Read More