విద్యార్థులకు ప్రత్యేక కిట్ పంపిణీ, రూ.953 కోట్లు ఖర్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్ లను పంపిణీ చేయనుంది. ఈ కొత్త పథకం పేరు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం”. దీనికోసం ఏటా రూ.953.71 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించబడింది. ఈ కిట్…
