Telangana 10th class exams have begun with 5,09,403 students appearing across 2,650 centers.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్‌ల ఫోన్ నంబర్లు ప్రదర్శించబడటంతో, ఏదైనా సమస్యలుంటే వెంటనే సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ప్రవేశపెట్టమని అధికారులు స్పష్టం…

Read More
LPU students achieved record placements with multi-crore salary packages, showcasing their exceptional talent.

ఎల్పీయూ విద్యార్థులకు కోటిన్నర ప్యాకేజీలతో రికార్డ్ ప్లేస్‌మెంట్స్

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రికార్డు స్థాయి ప్లేస్‌మెంట్స్ సాధించారు. వార్షికంగా కోట్ల రూపాయల వేతనాలతో ఇద్దరు విద్యార్థులు ఉద్యోగాలు పొందటం విశేషం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విద్యార్థి శ్రీ విష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల భారీ ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. అదే విధంగా బేతిరెడ్డి నాగ వంశీ రెడ్డి రూ.1.03 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఈ ఏడాది…

Read More
Single-session schools will be implemented across the state from April 15, with classes from 7:45 AM to 12:30 PM.

ఏప్రిల్ 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు అమలు కానున్నాయి. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 వరకు అన్ని పాఠశాలలు ఈ షెడ్యూల్‌ను పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అనుకూలమైన తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉదయం 7:45 గంటలకు పాఠశాలలు ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. అయితే, పదో తరగతి పరీక్షలు జరుగుతున్న…

Read More
ANU B.Ed exam paper leaked; Minister Nara Lokesh intervened and canceled the exam immediately.

నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ పేపర్ లీక్ – పరీక్ష రద్దు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన “ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్” పరీక్ష ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే బయటకు వచ్చిందని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హస్తక్షేపం చేసి పరీక్షను రద్దు చేశారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యా శాఖ అధికారులను మంత్రి లోకేశ్…

Read More
Good news for Telangana Inter students! A 5-minute grace period for exams is allowed. Strict security with CCTV and QR codes introduced.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై కీలక సడలింపు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక సడలింపు ఇచ్చింది. ఇన్నాళ్లూ అమలులో ఉన్న ఒక నిమిషం నిబంధనను తొలగించి, 5 నిమిషాల వరకు ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించనున్నారు. రేపటి నుంచి (మార్చి 5) ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుండగా, 9.05 వరకు విద్యార్థులు హాల్‌లో ప్రవేశించవచ్చు. 8.45 నుంచి 9 గంటల మధ్య ఓఎంఆర్ షీట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈసారి పరీక్షల్లో మరిన్ని…

Read More
At Vemulavada ZP School, educational kits worth ₹25,000 were distributed to 200 students by People's Save Serve Help Charitable Trust.

వేములవాడ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

కాకినాడ రూరల్ కరప మండలం వేములవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులకు పీపుల్స్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకరణాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్‌పర్సన్ పాట్నీడి పాలవేణి, మండల విద్యాశాఖ అధికారి కేబి కృష్ణవేణి విద్యార్థులకు ఈ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేబి కృష్ణవేణి మాట్లాడుతూ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. పాట్నీడి పాలవేణి…

Read More
Bobbili Chiranjeevulu stated that the coalition govt is committed to providing employment opportunities for unemployed youth.

నిరుద్యోగ సమస్య పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

తుని నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించేందుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా తుని నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తుండగా, ఈ రోజు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాధపురంలో ప్రచార సభ జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ గంట్ల చిన్నారావు, ఏరియా ఆసుపత్రి…

Read More