ఏపీ బడుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను ప్రభుత్వ బడుల్లో తొలితరగతిలో చేర్పించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇలాంటి ప్రయత్నం ద్వారా ప్రాథమిక విద్యను అందరికీ చేరువ చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు అధికారులు. అలాగే ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఆపై తరగతుల్లో చేర్చే కార్యక్రమానికి…
