Thieves attacked an elderly couple in Huzurabad, looting 80 tolas of gold and ₹7 lakh cash. Injured victims were shifted to hospital.

హుజురాబాద్‌లో దొంగలు బీభత్సం, వృద్ధ దంపతులపై దాడి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రతాపవాడలో ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడి, కత్తులతో బెదిరించి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. 80 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు, ఇంటి యజమాని రాఘవరెడ్డి దంపతులపై దాడి చేశారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. దొంగతనం జరిగే ముందు దుండగులు ఇంటి ముందు ఉన్న నీటి మోటార్ ఆన్ చేసి, ట్యాంక్ నిండిన నీళ్లు…

Read More
Four men assaulted a woman on a Bengaluru hotel terrace. Three suspects were arrested following the victim's complaint, and an investigation is underway.

బెంగళూరులో హోటల్ టెర్రస్‌పై మహిళపై దారుణం

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్య ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దోచుకుని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనను తెలుసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్ చేశారు. మరో…

Read More
Three arrested in Giddalur for selling ganja; police seized three kilos. Authorities plan drone surveillance to monitor illegal activities.

గిద్దలూరులో గంజాయి విక్రయదారుల అరెస్టు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అర్బన్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు హర్బన్ సీఐ సురేష్ బృందం నిఘా ఉంచి వారిని పట్టుకుంది. ముగ్గురిలో ఒకరు గిద్దలూరు వ్యక్తి కాగా, మరో ఇద్దరు తెలంగాణకు చెందినవారని గుర్తించారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మార్కాపురం డిఎస్పి యు నాగరాజు తెలిపారు. గిద్దలూరు ప్రాంతంలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు…

Read More
Police seized 122 kg of ganja worth ₹6.10 lakh at Nathavaram, arrested three suspects, and are searching for two absconding accused.

నాతవరం వద్ద 122 కేజీల గంజాయి పట్టివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం ములగపూడి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు నాతవరం ఎస్‌ఐ భీమరాజు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో AP 16 BA 5238 నంబర్ గల కారులో 6,10,000 విలువైన 122 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు ఈ గంజాయిని ఒడిశా బోర్డర్‌లోని రెల్లిగడ్డ గ్రామం…

Read More
Midnight thefts in 10 shops, cash stolen. Thieves ignored laptops, mobiles. CCTV captured footage. Police begin investigation.

అర్ధరాత్రి దొంగతనాలు – 10 షాపుల్లో నగదు దోచుకున్నారు

అర్ధరాత్రి సమయంలో దొంగలు పలు షాపుల షెల్టర్లు పగులకొట్టి దోచుకున్నారు. మొత్తం 10 షాపుల్లోకి ప్రవేశించిన దొంగలు క్యాష్ కౌంటర్‌లలో ఉన్న నగదును దోచుకున్నారు. షాపుల్లో లాప్‌టాప్‌లు, మొబైల్స్ వంటివి వదిలేసి, నగదు మాత్రమే ఎత్తుకెళ్లడం గమనార్హం. ఒక షాప్‌లో సీసీ కెమెరాలో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. ముఖాలు ముసుగులతో కప్పుకున్నప్పటికీ, వారి దోపిడీ తీరును స్పష్టంగా గుర్తించవచ్చు. దొంగలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అనుమానిస్తున్నారు. షాపు యజమానులు తెల్లవారుజామున వచ్చి తాళాలు తెరిచి చూసే సరికి…

Read More
In Mylavaram, a son planned his father's murder after watching YouTube videos. Police arrested him and presented him in court.

యూట్యూబ్ చూసి తండ్రిని హత్య చేసిన కొడుకు అరెస్ట్

ఈనెల 8వ తేదీన మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో మొక్కజొన్న తోటలో కడియం శ్రీనివాసరావు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. మైలవరం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా, ఈ హత్య వెనుక అతని కొడుకు పుల్లారావు (32) హస్తం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని మైలవరం ఏసిపి వై ప్రసాదరావు అధికారికంగా ప్రకటించారు. పుల్లారావు యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆస్తి తగాదాలతో తండ్రితో జరిగిన గొడవలో,…

Read More
BRS MLC Pochampally Srinivas Reddy gets police notice in Moinabad cockfight case. 64 arrested, large assets seized.

కోడిపందేల్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

మొయినాబాద్ మండలంలోని ఒక ఫాంహౌస్‌లో కోడిపందేల కేసు కుదుపు రేపింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఆయన మాదాపూర్ నివాసానికి వెళ్లి ఈ నోటీసులను ఇచ్చారు. ఈ కేసులో ఎమ్మెల్సీ పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తన ఫాంహౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. కానీ పోలీసులు కేసులో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలు కోరుతూ పోలీసుల…

Read More