A man was attacked with a knife and robbed of ₹11,000 near Tenali Katevaram. The victim is undergoing treatment, and police are investigating.

తెనాలి కటేవరం వద్ద దారుణం.. ప్రయాణికుడిపై కత్తి దాడి!

తెనాలి మండలం కటేవరం గ్రామం వద్ద అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో ప్రయాణికుడి మాదిరిగా ఎక్కి, అశోక్ కుమార్ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. అతని వద్ద ఉన్న రూ. 11,000 నగదును లూటీ చేసి పరారయ్యాడు. ఈ దాడితో అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు డ్వాక్రా డబ్బులు కడదామని బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతని గొంతు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం…

Read More
Former minister Perni Nani gets relief in ration rice case as High Court grants anticipatory bail.

రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి హైకోర్టులో ఊరట!

రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో ఏ6గా ఉన్న ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. దీంతో ఆయన అరెస్టు భయంతో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నానికి సంబంధం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆయనపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్షసాధింపు చర్యగా భావిస్తున్నట్టు ఆయన అనుచరులు అంటున్నారు. కేసు…

Read More
Land dispute leads to petrol attack in Dornala. Nagoor Vali suffers 80% burns, hospitalized. Police register a case and begin investigation.

దోర్నాలలో పెట్రోల్ దాడి.. యువకుడికి 80% కాలిన గాయాలు!

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలో భూవివాదం రక్తసిక్తమైంది. నాగూర్ వలి అనే యువకుడిపై మరో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ దాడిలో నాగూర్‌తో పాటు అతడితో ఉన్న ఓ మహిళ కూడా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, భూమి విషయంలో ఇద్దరి మధ్య చిచ్చు రాజుకున్నట్లు తెలుస్తోంది. అదే వివాదం క్రమంగా ఉద్రిక్తతలకు దారితీసి ఈ దారుణానికి కారణమైంది….

Read More
In the Gannavaram TDP office employee kidnap case, the court handed over Satyavardhan’s statement to the police. Verdict on Vamsi’s petition awaited.

గన్నవరం కిడ్నాప్ కేసులో కీలక పరిణామం

గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్న ఈ కేసులో, సత్యవర్ధన్ స్టేట్మెంట్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులకు అందజేసింది. కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ అవసరమని కోర్టును కోరగా, కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబులకు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి…

Read More
Pune crime branch arrested Randas, the accused in a sexual assault case, after a 75-hour manhunt.

పూణెలో లైంగికదాడి నిందితుడు అరెస్ట్, 75 గంటల తర్వాత పట్టివేత

మహారాష్ట్రలోని పూణెలో స్వర్‌గేట్ బస్ స్టేషన్ వద్ద యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు దత్తాత్రేయ రాందాస్‌ను 75 గంటల అనంతరం క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దుమారం రేపడంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, శునక దళాలు, 100 మంది పోలీసుల సహాయంతో మహారాష్ట్ర వ్యాప్తంగా అతడిని వెతికారు. నిందితుడు రాందాస్ గురువారం రాత్రి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడి చేసిన ఘాతుకం గురించి అప్పటికే…

Read More
Customs officials seized 172 grams of gold hidden in dates from a passenger arriving from Jeddah at Delhi Airport.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖర్జూరాల్లో దాచిన బంగారం పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణా ఘటనను గుర్తించారు. జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానంతో తనిఖీ చేయగా, అతని బ్యాగులో ఖర్జూరాలు ఉండటం కనిపించింది. బ్యాగేజీ చెకింగ్ సమయంలో మరింత పరిశీలన చేయగా, ఖర్జూరాల్లో బంగారు ముక్కలు దాచినట్లు అధికారులు గుర్తించారు. 56 ఏళ్ల ప్రయాణికుడు ఎస్వీ-756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. లగేజీ చెకింగ్ సమయంలో అతని బ్యాగ్‌పై అనుమానం కలిగిన…

Read More
A human trafficking gang smuggling newborns from Ahmedabad was busted by SOT Malkajgiri and Chaitanyapuri police, rescuing four infants.

హైదరాబాద్‌లో శిశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 11 మంది సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు చిన్నారులను రక్షించారు. రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పిల్లలను అమ్మే ముఠా మగబిడ్డలను నాలుగు నుంచి…

Read More