
తాటిపూడి జలాశయం గేటు తెరచి నీరు విడుదల
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం వరదనీటితో నిండిపోతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా నీటిమట్టం అధికం కావడంతో బుధవారం మధ్యాహ్నం జలాశయంలోని ఒక గేటు తెరిచి నీటిని విడుదల చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు గోస్తనీ నదిలోకి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాటిపూడి ఇరిగేషన్ ఏఈ తమ్మి నాయుడు ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. జలాశయం నుంచి నీరు విడుదల కారణంగా గోస్తనీ నదిలో ప్రవాహం పెరిగినట్లు తెలిపారు. నీటి…