
బాల గణపతి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ తారకరామ కాలనీ వీధిలో బాల గణపతి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దల ఆహ్వానం మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ట అనంతరం భక్తులకు దీవెనలు అందజేశారు. ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో…