Devotee rush increases at Sri Lakshmi Narasimha Temple in Seethanagaram, with grand pujas being performed.

సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని సీతానగరం గ్రామం సమీపంలో సువర్ణముఖి నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయని ఆలయ పూజారి పీసపాటి శ్రీనివాసచార్యులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఆలయాన్ని పవిత్ర క్షేత్రంగా భావించి భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి ముడుపులు సమర్పిస్తున్నారు. అనేక మంది భక్తులు దీక్షలు…

Read More
Collector Shyam Prasad urged everyone to take responsibility for Parvathipuram’s cleanliness.

స్వచ్ఛ సుందర పార్వతిపురం – కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు

స్వచ్ఛ సుందర పార్వతిపురం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఆయన పేర్కొన్నారు. పార్వతిపురం పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అలవాటుగా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు,…

Read More
Farmers' association demands MSP for cashew farmers and free spraying equipment to protect crops from weather-related damage.

జీడిమామిడి రైతుల రక్షణకు ప్రభుత్వ మద్దతు కావాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడి పంట రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 10న కురుపాం మండలం లేవిడి గ్రామంలోని రబ్బర్ తోటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరఘట్టం మండలం తూడి గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, జీడిమామిడి పంట అమ్ముకునే సమయంలో…

Read More
A 2K run was held at the district headquarters for Women’s Day, flagged off by the District Collector, followed by a human chain formation.

మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 2కె రన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీకి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ మానవహారం ఏర్పాటు చేసి, అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళల పట్ల గౌరవంతో మెలగాలని, సమాజంలో…

Read More
AP Municipal Workers Union demands permanent jobs for all municipal workers if APCOS is canceled, submitting a petition to the collector.

ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్!

ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, కాంట్రాక్టర్ల చేతుల్లోకి కార్మికులను నెట్టకూడదని హెచ్చరించారు. నాయకత్వం మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన 279 జీవోపై తీవ్రంగా పోరాడామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆప్కాస్ రద్దు చేస్తున్న ప్రభుత్వం కార్మికులకు మరింత…

Read More
The Science Expo at Palakonda Ravindra Bharati School was a grand event showcasing students' creativity and innovation.

పాలకొండ రవీంద్రభారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో ఘనంగా

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రవీంద్రభారతి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడం, శాస్త్రీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, నమూనాలు పాఠశాల ఆవరణలో ప్రదర్శించగా, అవి అటువంటి ప్రయోగాత్మక విద్యకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీఈఓ పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ, శాస్త్రీయ పరిశోధనలు, అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని…

Read More
Traces of black magic rituals found at midnight in Palakonda town, sparking fear among residents.

పాలకొండలో క్షుద్రపూజల ఆనవాళ్లు, స్థానికుల్లో భయం

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి పూట క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రహదారి మధ్యలో పసుపు, బొగ్గులు, నిమ్మకాయలు, గుడ్లు, కొబ్బరికాయలు ఉంచి, క్షుద్రపూజలకు గుర్తులా ఉన్న ముగ్గులు వేయడం స్థానికుల్లో అనేక అనుమానాలు రేకెత్తించింది. ఈ ఘటన నగరపంచాయితీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. శివాలయం వద్ద లింగోద్భవం కార్యక్రమం ముగించుకుని వస్తున్న మహిళలు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. అర్ధరాత్రి ఈ ప్రాంతంలో…

Read More