Traces of black magic rituals found at midnight in Palakonda town, sparking fear among residents.

పాలకొండలో క్షుద్రపూజల ఆనవాళ్లు, స్థానికుల్లో భయం

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి పూట క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రహదారి మధ్యలో పసుపు, బొగ్గులు, నిమ్మకాయలు, గుడ్లు, కొబ్బరికాయలు ఉంచి, క్షుద్రపూజలకు గుర్తులా ఉన్న ముగ్గులు వేయడం స్థానికుల్లో అనేక అనుమానాలు రేకెత్తించింది. ఈ ఘటన నగరపంచాయితీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. శివాలయం వద్ద లింగోద్భవం కార్యక్రమం ముగించుకుని వస్తున్న మహిళలు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. అర్ధరాత్రి ఈ ప్రాంతంలో…

Read More
Collector A. Shyam Prasad inspected the MLC elections at Parvathipuram Junior College and guided officials.

పార్వతీపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతున్నదో లేదో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి సమస్యలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించి, విధుల్లో ఉన్న అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని…

Read More
A massive fire broke out at Daddy LJ Grand Hotel near Daba Gardens, Visakhapatnam, with fire safety and police teams rushing to the scene.

విశాఖ డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నం డాబా గార్డెన్ సమీపంలోని డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో మొత్తం 13 గదులుండగా, 9 గదుల్లో అతిథులు ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదం గమనించిన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైరుసేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైరుసేఫ్టీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. టూ టౌన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు…

Read More
ASP Ramanamurthy inspected MLC election polling centers in Tenali and gave necessary instructions to officials.

తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెనాలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో…

Read More
MLA Burra Ramana Janeyulu expressed confidence that Alapati Raja will win the Pattipadu MLC elections with a huge majority.

పత్తిపాడులో ఆలపాటి రాజా విజయాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ధీమా

కాకుమాను మండలంలో పత్తిపాడు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు పాల్గొన్నారు. ఆలపాటి రాజా ప్రజలకు సేవ చేసే నాయకుడని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పత్తిపాడు నియోజకవర్గంలో ఆలపాటి రాజాకు పట్టభద్రుల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఎమ్మెల్యే రామాంజనేయులు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిన జగన్…

Read More
Frustrated by crushing delays, sugarcane farmers stormed the sugar factory, leading to police intervention.

షుగర్ ఫ్యాక్టరీ ముట్టడించిన చెరుకు రైతులు, ఉద్రిక్తత

గత కొంతకాలంగా షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో చెరుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక రోజు ఫ్యాక్టరీ పనిచేస్తే మరుసటి రోజు నిలిచిపోవడం వల్ల రైతులు తమ పంటను అమ్ముకోలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను ఎన్నిసార్లు ఫ్యాక్టరీ ఎండీకి తెలియజేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఉదయం చెరుకు రైతులు భారీ సంఖ్యలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద గుమిగూడి, “ఎండి డాం డాం” అంటూ నినాదాలు చేశారు….

Read More
BJP leaders condemned the vandalism of their flagpole in Adoni, demanding strict action against the culprits.

ఆదోనిలో బీజేపీ జెండా ధ్వంసం, నిరసన వ్యక్తం చేసిన నేతలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఐదవ వార్డ్ విజయనగర కాలనీలో బీజేపీ జెండా ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన జెండా పోల్ రాత్రికి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలపడుతున్నందునే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని, దీనివెనుక కుట్ర ఉందని వారు ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు దీనిపై…

Read More