Task Force police seized 32 red sandalwood logs and vehicles in Bhakarapeta forest area, arresting two smugglers.

భాకరాపేటలో 32 ఎర్రచందనం దుంగలు పట్టివేత

తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలోని దేవరకొండ మెయిన్ రోడ్డు వద్ద 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. దీంతో మోటార్ సైకిల్, లగేజీ వాహనంతో ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో, డీఎస్పీ బాలిరెడ్డి మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆర్ఐ సాయి గిరిధర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం…

Read More
Rajanagaram police seized 150 kg of ganja and arrested five people. A car, auto, and mobile phones were confiscated.

రాజానగరం పోలీసులు 150 కేజీల గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరు అండర్ బ్రిడ్జి వద్ద రాజానగరం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వాహన తనిఖీలు నిర్వహించగా, 150 కేజీల గంజాయితోswift dezire కారు, ఒక ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల ప్రకారం, సదరు నిందితులు AOB ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కారులో మొత్తం 75 ప్యాకెట్లు,…

Read More
Minister Lokesh stated in the Assembly that the previous government halted Nadu-Nedu projects, requiring ₹4,789 crore for completion.

నాడు-నేడు పనులు పెండింగ్‌లో ఉంచారని లోకేశ్ విమర్శ

మంత్రి నారా లోకేశ్ మంగళవారం అసెంబ్లీలో నాడు-నేడు ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద చేపట్టిన పనులను పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికే రూ.4,789 కోట్లు ఖర్చు అవుతుందని లోకేశ్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి…

Read More
Letter to Union Minister for Fishing Harbor in Srikakulam

శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్ కోసం కేంద్రమంత్రికి లేఖ

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ హార్బర్ అవసరమని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 230కి పైగా గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకారులుగా జీవిస్తున్నారని, వారికి ఆధునిక మత్స్యకార సౌకర్యాలు అవసరమని రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. సముద్ర తీర…

Read More
The government announced additional aid of ₹50,000 to ₹1 lakh for SC, ST, and BC beneficiaries, along with free sand and transport assistance.

ఇళ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు సాయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000, గిరిజనులకు రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ సహాయాన్ని ఇప్పటికే మంజూరైన PMAY (అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 లబ్ధిదారులకు వర్తింపజేస్తారు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరో ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. స్వయం సహాయక…

Read More
TTD EO Shyamal Rao suspended senior assistant Krishna Kumar for misappropriating foreign currency from the hundi.

హుండీ విదేశీ కరెన్సీ మాయం.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపులో భారీ అవకతవకలు వెలుగు చూసాయి. టీటీడీ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని దారి మళ్లించినట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ గుర్తించింది. ప్రతి నెల 1వ తేదీ పరకామణిలో జమ చేయాల్సిన విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ గత సంవత్సరం ఒక నెలలోనే రూ. 6 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాహా చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారం…

Read More
The Center announced that Amaravati construction loans won't count towards AP’s debt limit and assured full support.

అమరావతి రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన రుణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట్ర అప్పుల పరిమితిలోకి లెక్కించబోమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ తెలిపిన ప్రకారం, ఈ రుణాలను ఏపీ ప్రభుత్వం స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. రాష్ట్రం అప్పుల పరిమితిని దాటుతుందనే ఆందోళన లేకుండా ఈ నిధులను అభివృద్ధి…

Read More