 
        
            మంగళగిరి నరసింహస్వామి కల్యాణంలో నారా లోకేష్ దంపతులు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రోఛ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. వేదపండితులు స్వామివారికి విష్వక్షణ ఆరాధన,…

 
         
         
         
         
        