కోవూరులో వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళన
కోవూరు శాంతినగర్లోని దేవిరెడ్డి సురేష్ రెడ్డి ఇంట్లో రాత్రిపూట దొంగలు హల్చల్ చేయడం, అలాగే పడుగుపాడు ధాత్రి గ్రీన్ హోం ప్రాంతంలోని దయాకర్ రెడ్డి ఇంట్లో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడడం గ్రామస్థుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఈ ఘటనలు దొంగల దౌర్జన్యానికి నిదర్శనంగా మారాయి. గడిచిన రెండు నెలల్లోనే కోవూరులో ఐదు నుంచి ఏడు ఇళ్లలో దొంగతనాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సీసీ కెమెరాలు ఉన్నా కూడా దొంగల చైతన్యం తగ్గకపోవడం స్థానికులను గందరగోళానికి గురిచేస్తోంది….
