కోసిగి మండలంలో పౌష్టికాహార మహోత్సవం
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ సీడీపీఓ నాగమణి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంపై అవగాహన కల్పించాలనుకుంటున్నారు. అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పౌష్టికాహార మాసోత్సవాలు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో గర్భవతులకు, మాత శిశులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తుందని నాగమణి పేర్కొన్నారు. గర్భం దాల్చిన నాటినుండి కాన్పు అయ్యేంతవరకు సంపూర్ణ పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, చిరుధాన్యాలు, కోడిగుడ్లు,…
