
ఏపీ మెట్రో టెండర్లపై ఎండీ రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగానికి గేమ్చేంజర్గా భావిస్తున్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో ఫేజ్–1లో భాగంగా 80 కిలోమీటర్లకుపైగా మెట్రో ట్రాక్ నిర్మాణం జరగనుంది. ఇందులో సివిల్ పనుల టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.పీ. రామకృష్ణా రెడ్డి వివరించారు. ఫేజ్–1లో భాగంగా విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్ల ట్రాక్, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరుగుతుందని ఆయన…