Violent clash in Janasena Ainavilli; Mandal President Rajesh attacks leader Uma. Police arrest Rajesh; Uma hospitalized after midnight assault.

అయినవిల్లిలో జనసేనలో ఘర్షణ – అధ్యక్షుడి అరెస్ట్

అయినవిల్లిలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు ఉద్రిక్తంగా మారాయి. మునుపటి గొడవల నేపథ్యంలో జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, నాయకుడు తొలేటి ఉమపై అర్ధరాత్రి దాడికి దిగాడు. ఉమ ఇంట్లోకి చొరబడి పలువురితో కలిసి కర్రలతో దాడి చేశాడని బాధితులు తెలిపారు. ఈ దాడిలో ఉమకు తలపై బలంగా గాయమై, అతని భార్య కూడా గాయపడ్డారు. వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఉమ అనుచరులు తీవ్రంగా స్పందించి, రాజేష్…

Read More
Students should be disciplined to achieve success, said Vundavilli Rambabu. Farewell celebrations at Vignan College were filled with enthusiasm.

విజ్ఞాన్ కళాశాలలో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహణ

విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు సూచించారు. రాయవరం మండల కేంద్రంలోని విజ్ఞాన్, వీఎస్ఆర్ రూరల్ కళాశాలల ప్రాంగణంలో ఫేర్వెల్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమ్మి రెడ్డి విద్యాసంస్థల అధినేతలు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి, శేషవేణి, రాయవరం సాయి తేజ విద్యానికేతన్ చైర్మన్ కర్రి సందీప్ రెడ్డి, భాను రేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….

Read More
Spot billing workers, employed for 25 years, protested at the Collector’s office, fearing job losses due to smart meters.

స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం – స్పాట్ బిల్లింగ్ కార్మికుల ఆవేదన

స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని స్పాట్ బిల్లింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను, ఆధార్ కంపెనీ తెచ్చిన స్మార్ట్ మీటర్ల కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన కార్మికులు తమ సమస్యను అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000 మంది కార్మికులు, అమలాపురం డివిజన్‌లో 200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన…

Read More
Aqua farmers protested at the Collector's office over high electricity bills, demanding reduced feed costs and government support.

ఆక్వా రైతుల ఆందోళన – కలెక్టర్‌కు వినతిపత్రం

ఆక్వా రైతులు అధిక విద్యుత్ బిల్లులు, చెరువుల మేత ధరల పెంపు కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా కరెంటు విధానంలో రైతులకు మేలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా వ్యవసాయం ద్వారా వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని, చెరువుల మేత ధరలను…

Read More
Korangi team emerges as the winner in the DSR Mega Cricket Tournament held in Tallarevu. MLA Datla Subba Raju presented the awards.

తాళ్లరేవులో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నీ విజేతగా కోరంగి జట్టు

కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని, ఆటగాళ్లను అభినందించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 36 జట్లు పోటీపడ్డాయి. ఫైనల్ పోటీలో గాడిమొగ, కోరంగి జట్లు పోటీ పడ్డాయి. చివరకు విజేతగా కోరంగి జట్టు నిలవగా, రన్నరప్‌గా గాడిమొగ…

Read More
Minister Anam Rama Narayana Reddy visits Antarvedi temple with family, performs special rituals.

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన మంత్రి ఆనం

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో మంత్రిని ఆలయ రీతిపద్ధతిన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితుల ద్వారా వేదాశీర్వాదం అందించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్…

Read More
Villagers of Ainapuram staged a protest against illegal soil excavation, demanding immediate action.

అయినాపురంలో అక్రమ మట్టిపోతపై గ్రామస్తుల నిరసన

ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్ల ద్వారా భారీగా మట్టిని తరలించడం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. సర్పంచ్ మోకా రామారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి నిరసన తెలిపారు. సుమారు 40 ట్రాక్టర్లు రోజూ మట్టిని తరలిస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. తనేలు సమీపంలో అక్రమంగా రొయ్యల చెరువును తవ్వి, అక్కడి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో రోడ్లపై బురద…

Read More