A deadly virus is killing thousands of chickens in West Godavari. Farmers are facing heavy losses as the disease spreads rapidly without clear symptoms.

పశ్చిమగోదావరిలో కోళ్లను కాటేస్తున్న అంతుచిక్కని వైరస్

పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారేసరికి చనిపోతున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం పెంచిన కోళ్లు ఈ వైరస్ బారిన పడడంతో పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరి జిల్లాను భయపెట్టింది. అప్పట్లో కోళ్ల మరణాల కారణంగా మార్కెట్‌లో అమ్మకాలు…

Read More
Vote counting for the Godavari Teacher MLC by-election is underway at Kakinada JNTU, with results expected after 14 rounds on 9 tables.

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

కాకినాడ జేఎన్‌టీయూలో ఓట్ల లెక్కింపుఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్‌టీయూలో ప్రారంభమైంది. ఈ నెల 5న జరిగిన పోలింగ్‌లో 15,495 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా పోలింగ్ వివరాలుఈ ఎన్నికల పరిధిలో కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 11 మండలాల్లో పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో టీచర్లు వారి…

Read More
Odisha youth Chandan Behera (19) found dead by hanging in a Kovvur apartment near Theatre Center. Police are investigating the incident.

కొవ్వూరులో ఒరిస్సా యువకుడు ఉరేసుకుని మృతి……

కొవ్వూరు పట్టణంలో థియేటర్ సెంటర్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల చందన్ బెహరా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చందన్ బెహరా ఒరిస్సా నుంచి కొవ్వూరుకు వలస వచ్చి స్థానికంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అతని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న…

Read More
Korukonda police seize a vehicle carrying illegal ration rice in East Godavari district and arrest two individuals, while investigating further.

కోరుకొండలో అక్రమ రేషన్ బియ్యం వాహనం స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నంలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వాహనంలో సుమారు మూడు టన్నుల బియ్యం 80 సంచుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న కోరుకొండ పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి వాహనాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఒక వ్యక్తి మాత్రం కాపవరం అయిపోయాడని సమాచారం. రాజానగరం…

Read More
Over 600 tourists enjoyed a vibrant boat journey on the Godavari River to Papikondalu. The scenic beauty and cultural sites added charm to the trip.

గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర సందడి

గోదావరి నదిలో పర్యాటక బోట్లు సందడి చేశాయి. పాపికొండల విహారయాత్రకు శనివారం భారీగా పర్యాటకులు వెళ్లారు.ఎస్‌ఐ షరీఫ్‌ ఆధ్వర్యంలో బోట్లు పరిశీలన చేయడంతో పాటు, పర్యాటకులకు సూచనలు ఇచ్చారు. దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు. పది పర్యాటక బోట్లలో 604 మంది పర్యాటకులు వెళ్ళగా, పర్యాటకులతో గోదావరి నదిలో విహారయాత్ర సందడిగా సాగింది. ఉదయం 9 గంటలకు బయలుదేరిన పర్యాటక బోట్లు గోదావరి నది చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ, మధ్యాహ్నం సమయానికి పాపికొండలకు చేరుకున్నారు….

Read More
CPI and Rajahmundry Jatla Labour Union organized a protest demanding improved medical facilities and staff at the local ESI hospital.

రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి కోసం ధర్నా

రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వంద పడకల ఆసుపత్రికి అనుగుణంగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు ఆసుపత్రిలో అవినీతిని అరికట్టాలని, వైద్య సేవలు మెరుగుపరిచే అంశాలను పైకి తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామాలయం నుండి ప్రదర్శనగా ఆసుపత్రికి చేరుకున్న కార్మికులు, తమ ఆందోళనను విజ్ఞప్తి రూపంలో తెలియజేశారు. ఏఐటీయూసీ…

Read More
The Election Commission has announced the schedule for the Teacher MLC by-election in the East-West Godavari districts, with the election code coming into effect from November 4.

తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూలు

తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీరామచంద్రమూర్తి లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు….

Read More