A bike rally was organized in Nakkapalli under the leadership of DSP Srinivasa Rao, emphasizing the importance of wearing helmets for road safety.

హెల్మెట్ వినియోగంపై అవగాహనకు నక్కపల్లిలో బైక్ ర్యాలీ

నక్కపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించే ప్రాముఖ్యతపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నర్సీపట్నం డిఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. పోలీసులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు, వెదుళ్లపాలెం జంక్షన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బైక్ ప్రమాదాల్లో 90 శాతం మరణాలు…

Read More
Police seized 122 kg of ganja worth ₹6.10 lakh at Nathavaram, arrested three suspects, and are searching for two absconding accused.

నాతవరం వద్ద 122 కేజీల గంజాయి పట్టివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం ములగపూడి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు నాతవరం ఎస్‌ఐ భీమరాజు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో AP 16 BA 5238 నంబర్ గల కారులో 6,10,000 విలువైన 122 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు ఈ గంజాయిని ఒడిశా బోర్డర్‌లోని రెల్లిగడ్డ గ్రామం…

Read More
JanaSena is working on MangalaPuram barrage construction. PVSN Raju assured farmers of water supply and took the issue to Pawan Kalyan.

మంగళాపురం ఆనకట్ట కోసం జనసేన కృషి ముమ్మరం!

చోడవరం నియోజకవర్గంలోని మంగళాపురం ఆనకట్ట పునర్నిర్మాణానికి జనసేన పార్టీ కృషి చేస్తోంది. ఈ నిర్మాణం ద్వారా 7000 ఎకరాల పంట భూమికి సాగునీరు అందనుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు, స్థానిక రైతులు ఆనకట్ట పరిసరాలను పరిశీలించారు. ఆనకట్టలో నీరు వృధాగా పోతుండటంతో పాటు, ఎడమ కాలువ వైపు భూమి కోతకు గురవ్వడం గమనించారు. రైతులు గత ఆరు సంవత్సరాలుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…

Read More
Home Minister Vangalapudi Anita took a holy dip at Revupolavaram, interacted with devotees, and assured that all arrangements were in place.

మాఘ పౌర్ణమి పుణ్యస్నానం – భక్తులకు అన్నీ ఏర్పాట్లు!

మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత రేవుపోలవరంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం లక్ష్మి మాధవ స్వామిని దర్శించుకుని భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రేవుపోలవరంలో మహోత్సవ ఏర్పాట్లు గాలికి వదిలేశారని మంత్రి విమర్శించారు. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం…

Read More
CPM alleges coalition leaders are deceiving Ghaghar factory farmers. Venkanna criticizes the government’s stance on farmer issues.

ఘగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పై సిపిఎం ఆగ్రహం

అనకాపల్లి జిల్లా చోడవరంనియోజకవర్గంలోని ఘగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు డి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, కూటమి నాయకులు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను అధికారంలో ఉన్న నేతలు అర్థం చేసుకోవాల్సింది పోయి, మొసలి కన్నీళ్లు కారుస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఘగర్ ఫ్యాక్టరీలను అభివృద్ధి…

Read More
Officials inspect safety measures at Rambilli coast for Magha Purnima. Devotees advised to follow police warnings.

రాంబిల్లి తీరం వద్ద భద్రతా చర్యలు పరిశీలించిన అధికారులు

మాఘ పౌర్ణమి నేపథ్యంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఎమ్మార్వో ఏ శ్రీనివాసరావు, పరవాడ డి.ఎస్.పి విష్ణు స్వరూప్ తీరం వద్ద ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు అనువుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక సీఐ హెచ్. నరసింగరావు మాట్లాడుతూ, మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా ఫిబ్రవరి 11న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేయాలని, సముద్ర అలల ఉద్ధృతిని…

Read More
On Bhishma Ekadashi, a grand Laksha Deeparadhana was held at Narsipatnam Sai Baba Temple. Speaker Ayyannapatrudu participated in special prayers.

నర్సీపట్నం సాయిబాబా ఆలయంలో లక్ష దీపారాధన వేడుక

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం శ్రీ షిరిడిసాయి ఆలయంలో 23వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆలయాన్ని సందర్శించారు. వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు భక్తులకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More