Pedagaruvu tribals in Anakapalli district demand clean drinking water, warning of protests if the issue remains unresolved.

పెదగరువు గిరిజన గ్రామానికి మంచినీటి కోసం పోరాటం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీకి చెందిన పెదగరువు PVTG ఆదివాసి గిరిజన గ్రామస్తులు మంచినీటి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. 13 కుటుంబాలు, 60 మంది జనాభా కలిగిన ఈ గ్రామానికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో, కొండ దిగుతూ గడ్డలో షెలము తీసుకొని నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవిన్యూ రికార్డుల్లో గ్రామం లేకపోవడంతో మంచినీటి స్కీమ్‌లకు వీలుకాదని అధికారులు చెప్పడం బాధాకరమని గిరిజనులు తెలిపారు. 2019లో గ్రామస్తులు స్వయంగా శ్రమదానం చేసి 40 అడుగుల…

Read More
Frustrated by crushing delays, sugarcane farmers stormed the sugar factory, leading to police intervention.

షుగర్ ఫ్యాక్టరీ ముట్టడించిన చెరుకు రైతులు, ఉద్రిక్తత

గత కొంతకాలంగా షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో చెరుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక రోజు ఫ్యాక్టరీ పనిచేస్తే మరుసటి రోజు నిలిచిపోవడం వల్ల రైతులు తమ పంటను అమ్ముకోలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను ఎన్నిసార్లు ఫ్యాక్టరీ ఎండీకి తెలియజేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఉదయం చెరుకు రైతులు భారీ సంఖ్యలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద గుమిగూడి, “ఎండి డాం డాం” అంటూ నినాదాలు చేశారు….

Read More
On Maha Shivaratri, devotees thronged Elamanchili temples, with authorities making special arrangements for seamless darshan.

ఎలమంచిలి శివాలయాల్లో మహాశివరాత్రి భక్తి సందడి

భక్తులు పరమ పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎలమంచిలి నియోజకవర్గంలోని శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు ఆలయాలకు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతర దర్శనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి శివుని కీర్తిస్తూ ప్రత్యేక వ్రతాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ…

Read More
A man was found hanging from a tree in Narsipatnam NTR Stadium. A bag, knife, and broken glasses were recovered from the scene.

నర్సీపట్నం స్టేడియంలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన ప్రజలు మృతదేహాన్ని వేలాడుతూ చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనతో స్టేడియం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఓ బ్యాగు, చిన్న కత్తి, విరిగిన కళ్లద్దాలు లభ్యమయ్యాయి. మృతుడు ఎవరు? ఈ ఘటన ఆత్మహత్యా లేదా హత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు మృతదేహాన్ని…

Read More
Authorities demolished illegal constructions by a YSRCP leader in Narsipatnam. Former MLA Ganesh made strong remarks.

నర్సీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, ఉద్రిక్తత

నర్సీపట్నం మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాల తొలగింపును చేపట్టారు. శారద నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన వైసీపీ నేత కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఉదయం 6 గంటలకే మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు. ఈ చర్యల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం…

Read More
YSRCP leader Karri Srinivas made shocking remarks on Speaker Ayyanna, saying, "Either kill me or I will kill you."

స్పీకర్ అయ్యన్నపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేత, బిల్డింగ్ యజమాని తమ్ముడు కర్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను చంపేయండి లేదా మిమ్మల్ని చంపేస్తాను” అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నర్సీపట్నంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వివాదం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సంబంధించిన భవనం వ్యవహారంలో చోటుచేసుకుంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని కోరినప్పటికీ, స్పీకర్ వారి పక్షాన సహకరించలేదని కర్రి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన…

Read More
Speaker Ayyannapatrudu inspected Balighattam bathing ghats and reviewed arrangements for Maha Shivaratri.

నర్సీపట్నం బలిఘట్టం ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్

మహాశివరాత్రి సందర్భంగా నర్సీపట్నం బలిఘట్టం స్నాన ఘట్టాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పట్టణ సీఐ గోవిందరావుకు పోలీస్ బందోబస్తును పకడ్బందిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ, మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. నర్సీపట్నం ఉత్తర వాహినిని “దక్షిణ కాశీ”గా పిలుస్తారని, పూర్వం నుండి భక్తులు…

Read More