మంత్రాల నెపంతో మహిళపై దారుణ దాడి

In Medak district, a woman was brutally attacked and set on fire by villagers in Kaatriyal village, accused of practicing witchcraft. In Medak district, a woman was brutally attacked and set on fire by villagers in Kaatriyal village, accused of practicing witchcraft.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రాల నెపంతో ఓ మహిళను చితకబాదిన సంఘటన మరువకముందే ఇదే మండలం కాట్రియాల గ్రామంలో అర్థరాత్రి దారుణంచోటుచేసుకుంది.
కాట్రియాల గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ(50) మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఇంటి పక్కన వారు గ్రామస్తులు కొందరు చితక బాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆమె కొడుకు కోడలు కళ్ళముందే జరిగిన ఎంత అరిసిన చుట్టుపక్కల వారు రాలేరని తమ పాలోలే ఈ ఘటనకు పాల్పడ్డారని కుమారుడు రవి తెలిపారు ఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి,రామాయంపేట సిఐ వెంకట రాజగౌడ్ తీవ్రగాయాల పాలైన డేగల ముత్తవ్వ(50)ను వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *