కాంగ్రెస్ సీనియర్ నేత వసంత్ చవాన్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (69) అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నైగావ్ వసంత్ చవాన్ స్వస్థలం. 2002లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు నైగావ్ ఎమ్మెల్యేగా ఉన్నారు….
