సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే రైతుబంధు విధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు నిధుల కోసం బిఆర్ఎస్ పార్టీ నిరసన
In Siddipet district, the BRS party staged a protest demanding the immediate release of Rythu Bandhu funds, highlighting the needs of the farming community.
