పోచమ్మ దేవాలయంపై దుండగుల దాడి

In Kamareddy, unidentified assailants vandalized the Pochamma Temple, stealing deities and valuables. Local associations demand action against the culprits and restoration of the idols. In Kamareddy, unidentified assailants vandalized the Pochamma Temple, stealing deities and valuables. Local associations demand action against the culprits and restoration of the idols.

కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ లోని గ్రామ దేవతలైన పోచమ్మ దేవాలయంలోకి నిన్న అర్ద రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు బీభత్సవం సృష్టించి పోచమ్మ , ముత్యాలమ్మ , లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాలు అపహారించడం జరిగింది , వేద పండితుల సమక్షంలో హిందూ దర్మ సాంప్రదాయ పద్దతిలో శాస్త్రోప్తేతంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలతో పాటు ఆలయంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది.

విషయం తెలుసుకున్న హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు , కాలనీ వాసులు , ఆలయ పండితులు మరియు హిందూ దార్మిక సంఘాలు , రాష్ట్ర ఆర్యక్షత్రియ సంఘం అధ్యక్షులు నిట్టు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి కి మెమోరాండం సమర్పించి దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించి 2-3 రోజుల్లో అమ్మ వారి విగ్రహాలను అప్పగించి మా హిందూ మనోభావాలు కాపాడాలని కోరడం జరిగింది , లేని పక్షంలో కామారెడ్డి పట్టణంలోని అన్ని కుల సంఘాలు , వ్యాపార వాణిజ్య సంఘాలు , మరియు హిందూ దార్మిక సంఘాలతో సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మంచి రవి , ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ , వార్డు కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్ రావు , ముప్పారపు ఆనంద్ , నిట్టు వెంకట్ రావు , మదాం నవీన్ , చింతల రమేష్ , అసోసియేషన్ ప్రతినిధులు అంజయ్య , సాయిలు , సిద్దిరామ గౌడ్ , నాగేశ్వర్ రావు , ఆకుల నారాయణ , అసోసియేషన్ ప్రతినిధులు , ఆలయ పండితులు , కాలనీ వాసులు మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *