నాతవరం మండల కేంద్రం లో అయ్యప్ప ఫైర్ వర్క్స్ అండ్ జనరల్ స్టోర్స్ బాణా సంచా(మందు గుండు) షాపు ప్రారంభించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ షాపు నడపడం జరుగుతుందని ,అనకాపల్లి జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరల్లో హోల్ సేల్ రేట్లకే అమ్మడం జరుగుతుందని ప్రోప్రైటర్ రాజు అన్నారు.
అలాగే బాణాసంచా వ్యాపారం చేస్తున్న వారికి తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుందని,పండుగలకు, శుభకార్యాలకు కూడా మీ ఆర్డర్ పై సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.
ఈ షాపు తాండవ ప్రాజెక్ట్ కు వెళ్లే దారిలో నిర్మించడం జరిగిందని,ప్రజలందరూ మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని ప్రో,, రుత్తల రాజు కోరారు.

 
				 
				
			 
				
			 
				
			