జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామం దేవి సెంటర్ లో వెంచేసి వున్న శ్రీ గురుదత్త శిరిడి సాయి వీరాంజనేయ సహిత విగ్నేశ్వర స్వామి వారి దేవాలయం లో
దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ సంవత్సరం 108 మంది మహిళా భక్తులతో ఘనంగా అమ్మవారి బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో
కొన్ని వందల మంది భవానీలు బోనాలతో పాటు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతూ అమ్మవారి గుడికి బోనాల సమర్పించారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసారు
ప్రతి సంవత్సరం లా కొన్ని వేల మందికి అన్న సంతర్పణ చేసారు
ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ పెద్దలు, దేవి సెంటర్ యూత్ గత 3 రోజుల నుండి భారీ ఏర్పాటులతో ఈ కార్యక్రమం నిర్వహించారు

 
				 
				
			 
				
			 
				
			