ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ పై ఇందుకూరుపేట ఎక్సైజ్ సీఐ జీవీ ప్రసాద్ రెడ్డి గురువారం మీడియాకు దీనికి సంబంధించిన విషయాలను వివరించారు,
ఇందుకూరుపేట మండలంకు సంబంధించి 5 షాపులు, తోటపల్లి గూడూరు మండలంకు 5 షాపులు
ముత్తుకూరు మండలంకు 8 షాపులను,
మొత్తం మూడు మండలాలకు కలిపి 18 షాపులను కేటాయించినట్లు వారు తెలిపారు, ఈనెల1 తేదీ నుంచి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపారు,
11వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ పద్ధతిలో నిర్ణయించిన ప్రకారం ఎంపిక చేసి 12వ తేదీ నుంచి మద్యం షాపులు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. బడికి గుడికి దూరంగా ఈ షాపులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని సిఐ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ
 The Excise CI GV Prasad Reddy explained the new liquor policy in Andhra Pradesh, detailing the allocation of 18 shops across three mandals
				The Excise CI GV Prasad Reddy explained the new liquor policy in Andhra Pradesh, detailing the allocation of 18 shops across three mandals
			
 
				
			 
				
			 
				
			