గంగవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.
గురువారం అర్చకులు సాయి చక్రధర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్ల నాగేశ్వరరావు శ్రీమతి కళ్యాణి దంపతులచే కలశపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ పది రోజులు ఆలయంలో అమ్మవారిని రకరకాల రూపాలతో అలంకరిస్తూ లక్ష కుంకుమార్చన, అగ్ని హోమం పూజలు, నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకోవాలని ఆయన అన్నారు. మండల కేంద్రంలో దేవీనవరాత్రులు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , రమేష్, కిషోర్ సూరిబాబు, శ్రీను దొర, అబ్బాయి దొర, శేషాచార్యులు, రమణ ఆలయ కమిటీ కుర్రోళ్ళు తదితరులు పాల్గొన్నారు.
గంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
 Navaratri celebrations commenced grandly at Sri Rajarajeshwari Temple in Gangavaram under the temple committee's guidance, featuring special rituals and poojas.
				Navaratri celebrations commenced grandly at Sri Rajarajeshwari Temple in Gangavaram under the temple committee's guidance, featuring special rituals and poojas.
			
 
				
			 
				
			 
				
			