ఖబడ్దార్ HYDRA నా నియోజకవర్గంలో ఏ ఒక్క బుల్డోజర్ యైన ముందుగా నన్ను దాటి ముందుకు వెళ్లాలి అని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలలో మార్కింగ్లు చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు అందరు ధైర్యంగా ఉండాలని కోరారు.
అధికారులు ఎలాంటి మార్కింగులు వేసినా, మీకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక అవసరమని అన్నారు.
ప్రజల ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల భద్రత కోసం ప్రభుత్వానికి వ్యూహం ఉండాలి, అందుకే ఆయన సత్వర చర్యలు తీసుకుంటారని తెలిపారు.
అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని, కాలనీవాసులకు ఎలాంటి నష్టం కలిగినివ్వమని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ చర్యలను సమర్థించుకోవడానికి మరియు ప్రజల సురక్షితాన్ని పెంపొందించడానికి ఆయన శ్రద్ధ చూపుతున్నారు.

 
				 
				
			 
				
			