పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించే ఆమోదం

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం సానుకూల స్పందన తెలిపింది. అవసరమైన నిధులు, బకాయిలు సహా అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించే ఆమోదం

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. 

ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధానమంత్రి, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి సానుకూల స్పందన వెలువడింది. 

జాతీయ ప్రాజెక్టు పోలవరంను పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వెలిబుచ్చింది. బకాయిలు సహా, నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *