కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి దుర్మరణం

కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి మృతి

గద్వాల జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాలలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి ఉన్న కారు దుర్ఘటనకు గురైంది.

కొత్తకోట సమీపంలో కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఢీ అంత భయంకరంగా ఉండడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది.



ఈ ప్రమాదంలో సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సహచరులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

అదే సమయంలో టాయిలెట్ కోసం కిందకు దిగిన మరో ముగ్గురు సెక్రటరీలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. వారు కారులో ఉండి ఉంటే ప్రమాదం మరింత తీవ్రమయ్యేదని చెబుతున్నారు.

ALSO READ:ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చలు సఫలం – కళాశాలల బంద్‌ విరమణ


ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కొత్తకోట ప్రాంతంలో కొద్ది గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు రోడ్డు భద్రతా చర్యలు పెంచాలని అధికారులను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *