విద్యార్థినులతో కాళ్లు నొక్కించిన లేడీ టీచర్‌ – ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు

విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న లేడీ టీచర్‌ ఘటన Govt Teacher Suspended

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్‌ వారినే కాళ్లు పట్టించుకోవడం సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి,సదరు ఉపాధ్యాయురాలు సుజాతను తక్షణం సస్పెండ్‌ చేసింది.సుజాత ఆ పాఠశాలలో హెడ్‌మిస్ట్రెస్‌గా (హెచ్‌ఎం) పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వైరల్‌ వీడియోలో ఆమె కుర్చీలో కూర్చుని మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగా, ఆమె ముందు ఇద్దరు విద్యార్థినులు నేలపై మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చెందడంతో ప్రజలు, తల్లిదండ్రులు, విద్యా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యా వ్యవస్థ పరువుని దెబ్బతీసే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసి, విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పూర్తి నివేదిక సమర్పించాలంటూ సూచనలు ఇచ్చింది.

ఈ ఘటన విద్యారంగంలో క్రమశిక్షణా లోపాలపై మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *