అయోధ్య రామాలయం చుట్టూ నాలుగు కిమీ ప్రహరీ గోడ

Ayodhya Ram Temple trust plans a 4 km perimeter wall for security, to be built in 18 months. Major updates shared by committee head Nripendra Mishra. Ayodhya Ram Temple trust plans a 4 km perimeter wall for security, to be built in 18 months. Major updates shared by committee head Nripendra Mishra.

శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా ఆలయం చుట్టూ నాలుగు కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఈ విషయం ఆలయ నిర్మాణ కమిటీ సమావేశ మూడో రోజు చర్చకు వచ్చింది. భద్రతా అంశాలపై, ఆలయ పరిసరాల అభివృద్ధిపై, విగ్రహాల ప్రతిష్ఠాపనపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్ర మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. ఆలయం అంతర్గతంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రామాలయ సముదాయంలో పది ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మరో పది ఎకరాల్లో సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రయాణికుల కోసం 62 స్టోరేజ్ కౌంటర్లతో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆలయానికి సంబంధించిన విగ్రహాలన్నీ ఇప్పటికే జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని వివరించారు. సప్త మండలాల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల ఆరాధన కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

భద్రత గోడ నిర్మాణానికి ఇంజనీర్స్ ఇండియా సంస్థను నియమించారని మిశ్ర తెలిపారు. గోడ ఎత్తు, మందం, రూపకల్పనలపై తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మట్టి పరీక్షలు పూర్తైన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తం ప్రహరీ గోడ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని కమిటీ అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *