ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-బంగ్లా పోరు ప్రారంభం

Indian bowlers dominate in the Champions Trophy as Bangladesh loses 5 wickets for just 35 runs. Shami, Harshit, and Axar shine. Indian bowlers dominate in the Champions Trophy as Bangladesh loses 5 wickets for just 35 runs. Shami, Harshit, and Axar shine.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భార‌త్‌, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకుంది.

బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా జత కట్టగా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసింది. దీంతో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో స్థానం దక్కలేదు. వికెట్ కీపర్ ఎంపికలో రోహిత్ శర్మ టీమ్ కేఎల్ రాహుల్‌కే మొగ్గు చూపి, రిషభ్ పంత్‌ను పక్కన పెట్టింది.

టాస్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ, తొలుత బౌలింగ్ చేయడమే తమ వ్యూహమని తెలిపారు. ఈ మైదానంలో ఫ్లడ్‌లైట్ల కింద బ్యాటింగ్ చేయడం సులభంగా ఉంటుందని చెప్పాడు. టీమిండియా తన బ్యాటింగ్ పటిష్టంగా ఉందని, బౌలింగ్ విభాగం కూడా సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.

ఇక, బంగ్లాదేశ్ జట్టు తన బౌలింగ్ దళంపై పూర్తి నమ్మకంతో ఉంది. తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్ మిడిలార్డర్‌ను బలోపేతం చేయనున్నారు. మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *