సత్యవేడు పోలీసులు ఊతుకోట రహదారిలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో, అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ వాహనాలను ఆపి తనిఖీ చేసారు, దీంతో 80 గ్రాముల బంగారం మరియు సుజుకి జెన్ కారు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన దొంగలు శిరంబదూరు, దాస కుప్పం ప్రాంతాలలో చోరీలు చేసినట్లు పోలీసులకు ఒప్పుకున్నారు. వీరిపై తమిళనాడులో పలు కేసులు ఉన్నాయని విచారణలో వెలుగుచూసింది.
అతనలలో వి. కన్నదాసన్, ఎస్. కార్తీక్ (కాయన్) విల్లుపురం జిల్లా నుంచి, జి. శ్రీరామ్ (బిల్లు), ఎస్. రంజిత్ కుమార్ తిరువన్నామలై జిల్లా నుంచి, డి. రవీగ కాంచీపురం జిల్లాకు చెందిన వారు. ఈ ఐదుగురు దొంగలను రిమాండ్కు తరలించామని ఎస్సై రామస్వామి వెల్లడించారు.