సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన ఓ తీవ్ర పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. కేసు ప్రకారం, నిందితుడు వరికుప్పల మహేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఒక మైనర్ బాలికను మభ్యపెట్టి, ఆమెను అపహరించి, లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన Cr.NO 814/2018 కేసులో నమోదైంది.
సరూర్నగర్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన ఈ కేసులో, U/S 366, 376(2)(n) IPC & SEC 5 R/w 6 ఆఫ్ పోక్సో చట్టం ప్రకారం నిందితుడు దోషిగా నిర్ధారించబడ్డాడు. ఈ కేసులో గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ద్వారా 31/12/2024 నాడు 20 ఏళ్ల కఠిన శిక్ష విధించారు.
నిందితుడి పై రూ.25,000/- జరిమానా కూడా విధించారు. అలాగే, బాధితురాలు పట్ల జరిగిందైన అత్యాచారానికి, ఆమెకు రూ.5,00,000/- పరిహారం కూడా ఇవ్వాలని ఉత్తర్వులు వెలువడినవి. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సునీత గారు సాక్ష్యాలు వినిపించారు.
ఈ శిక్ష చర్య ద్వారా, పోక్సో చట్టం క్రింద కఠినమైన శిక్షలు అమలవుతున్నాయని, బాలికలకు భద్రత ఇవ్వడానికి ముఖ్యమైన పాఠాలను ఇచ్చింది.
