సంక్షేమ పథకాల సర్వేను సమగ్రంగా పరిశీలించిన జిల్లా పాలనాధికారి

జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలంలో రాయిగూడ, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే పూర్తి చేసి, 21న గ్రామసభల్లో జాబితా ప్రవేశపెట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా తయారు చేయాలని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ తుకారాం, DLPO ఫణీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *