జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు. ఈ దృశ్యాలను మోదీ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో పంచుకున్నారు.
దేశ రాజకీయాల్లో శిబు సోరెన్ సుదీర్ఘ ప్రస్థానానికి నివాళిగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
