భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన – అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు.
ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
పరిశీలనలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, ఆర్డిఓ దాట్ల కీర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.

స్థానిక సమస్యలపై దృష్టి
ఏ. రావివలస వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణ అవసరం, ఆర్ & ఆర్ కాలనీలో త్రాగునీటి సమస్య వంటి అంశాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద పునాది అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
