అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. గాజా ప్రాంతంలో శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసిస్తూ, అదే సమయంలో భారత్పై ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ ప్రశ్నించారు.
సోమవారం, హమాస్ చెరలో ఉన్న మిగిలిన 20 మంది బందీల విడుదల విషయంపై ప్రధాని మోదీ స్పందించారు. బందీల కుటుంబాల ధైర్యం, ట్రంప్ శాంతి యత్నాలు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంకల్పం గాజాలో శాంతికి స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఈ ప్రాంతంలో శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని వ్యాఖ్యల తర్వాత, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ స్పందిస్తూ, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంపై ఒత్తిడిని పెంచే ప్రయత్నాలు అని విమర్శించారు. “భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ఆపడానికి తాను టారిఫ్లను ఉపయోగించానని ట్రంప్ చెబుతున్నది 51వ సారి. మన ప్రధాని మాత్రం మౌనంగా ఉన్నారని ఆశ్చర్యం” అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పౌరులు మరణించిన ఘటనకు ప్రతీకారంగా, మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో నాలుగు రోజుల పాటు దాడులు జరిగాయి. మే 10న కాల్పుల విరమణ ఒప్పందం చేరినప్పటికీ, భారత్ తాము డీజీఎంవో చర్చల ద్వారా మాత్రమే ఈ ఒప్పందానికి వచ్చామని స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ పలుమార్లు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా యుద్ధాన్ని ఆపానని చెప్పాడు.
ఈ అంశాలు భారత్-అమెరికా సంబంధాలు, మరియు భారతీయ సామ. విధానంపై రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.