జోగులాంబ గద్వాల జిల్లా జాతీయ రహదారి పై భారీ వాహన తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం ద్వారా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. 04 గంటల నుంచి 06 గంటల వరకు ఈ తనిఖీలు జరిగాయి.
ఈ సందర్భంగా 76 బస్సులు, 256 గూడ్స్ వాహనాలు, 168 లారీలు, 171 కార్లు, 134 ఆటోలు, 365 బైక్లను తనిఖీ చేయడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ కూడా తీసుకోబడింది.
తనిఖీలలో ద్రువ పత్రాలు లేని 05 బొలిరో వాహనాలు, 124 ఆటోలు, 102 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయబడ్డాయి. 16 DD కేసులు మరియు 35 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు అయ్యాయి.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అక్రమ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఉండటానికి మరియు ప్యాసింజర్స్ను సరైన విధంగా తరలించేందుకు ఈ తనిఖీలు అవసరమన్నారు.
వాహన దారులు సమాజానికి బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆయన సూచించారు. ప్రమాదాలు తగ్గించడానికి ప్రజలు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో 180 మంది పోలీస్ సిబ్బంది, 3 సీఐలు, 18 ఎస్సైలు పాల్గొన్నారు. ఇటువంటి చర్యలు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
