ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే మ్యాచ్ జరుగుతోంది. చిరకాల ప్రత్యర్థులు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు గ్రూప్-బి మ్యాచ్లో పోటీపడుతున్నాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఈ హోరాహోరీ సమరం కొనసాగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభంలోనే దూకుడుగా ఆడినా, ఆస్ట్రేలియా బౌలర్లు తొందరగానే రెండు కీలక వికెట్లు తీసుకున్నారు. 12 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాట్స్మన్ జేమీ స్మిత్ 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ రెండు వికెట్లను ఆసీస్ బౌలర్ డ్వార్షూయిస్ సాధించాడు. ప్రస్తుతానికి క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్ (27 బ్యాటింగ్), జో రూట్ (22 బ్యాటింగ్) నిలదొక్కుకుని బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ జట్టు మెరుగైన స్కోర్ సాధించాలంటే ఈ ఇద్దరు కీలకంగా మారనున్నారు.
ఇకపోతే, ఆస్ట్రేలియా బౌలర్లు శక్తివంచన లేకుండా బౌలింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను త్వరగా కుప్పకూల్చి చిన్న లక్ష్యాన్ని చేధించాలని ఆసీస్ చూస్తోంది. మరోవైపు, ఇంగ్లండ్ జట్టు మంచి స్కోర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడంతో అభిమానులు ఉత్కంఠగా గమనిస్తున్నారు.
