కలెక్టరేట్ బాంబు బెదిరింపు కలకలం – తేనెటీగల దాడి

During a bomb threat probe at Kerala Collectorate, a bee attack left 70 injured, creating chaos and panic. During a bomb threat probe at Kerala Collectorate, a bee attack left 70 injured, creating chaos and panic.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని కలెక్టరేట్‌లో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబ్ స్క్వాడ్, పోలీసులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో, భవనం వెనుక ఉన్న తేనెతుట్టెను ఆకస్మాత్తుగా కదిలించడంతో తేనెటీగల గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది.

ఈ దాడిలో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వాధికారులు, జర్నలిస్టులు, ప్రజలు ఉన్నారు. బాధితులను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొందరికి తీవ్రంగా కుడుచుకోవడంతో సెలైన్ కూడా ఎక్కించాల్సి వచ్చిందని కలెక్టర్ అను కుమారి తెలిపారు.

బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. కలెక్టరేట్‌లో ఎస్ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు అమర్చినట్టు ఈమెయిల్‌లో పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భవనం ఖాళీ చేసి, తనిఖీలు చేపట్టారు.

అంతిమంగా, బాంబు బెదిరింపు ఉత్తదేనని నిర్ధారణ అయ్యింది. కానీ, ఆ సమయంలో జరిగిన తేనెటీగల దాడి మొత్తం ఘటనను మరింత తీవ్రమైనదిగా మార్చేసింది. అధికారులు ఈ బెదిరింపు మెయిల్‌ను పంపినవారిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *