ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అతిథిగా హాజరయ్యారు

ఉచిత మెగా వైద్య శిబిరం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు,ఈ ప్రభుత్వంలో యన్టీఆర్ ఆరోగ్య శ్రీ గా పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు. ఉచిత మెగా వైద్య శిబిరం

కర్నూలు జిల్లా, కోసిగి మండలం కర్నూలు ఆర్ ఆర్ హాస్పిటల్, సౌజన్యంతో స్థానిక మౌంట్ కార్మెల్ స్కూల్లో పాదర్స్ జోజి, బాల ఏసు నేతృత్వంలో ఆర్ ఆర్ హాస్పిటల్,కర్నూలు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి, మండల ఇంచార్జీ శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ,
ఆరోగ్య శ్రీ సృష్టికర్త,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని,గత ప్రభుత్వంలో జగనన్న గారు వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా,ఈ ప్రభుత్వంలో యన్టీఆర్ ఆరోగ్య శ్రీ గా పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు. యన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలను మరింతగా విసృతం చేసి, పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *