భారీ గాయాల నుంచి కోలుకుని ఇండియా జెర్సీకి మళ్లీ తిరిగొచ్చాడు టీమ్ఇండియా డైనమిక్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్. ఇంగ్లండ్తో రానున్న టెస్టు సిరీస్కు అతను పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా టెస్టు జెర్సీలో మెరిసిన పంత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2022 డిసెంబర్లో జరిగిన కార్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, దాదాపు 15 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ ఇప్పుడు టెస్టు క్రికెట్కి కూడా పూర్తిగా సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్తో జరగబోయే సిరీస్కు ముందు ప్రాక్టీస్ లో టెస్టు జెర్సీ ధరిస్తూ కనిపించిన రిషబ్ పంత్, తన ఫిట్నెస్తో అందరిని ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండింటిలోనూ అతని మునుపటి ఫామ్ కనిపించిందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.